← Back to news

డిజాస్టర్ అవగాహన.. బాపట్ల జిల్లాలో విద్యార్థులకు శిక్షణ!

By .· 2d ago
డిజాస్టర్ అవగాహన.. బాపట్ల జిల్లాలో విద్యార్థులకు శిక్షణ!

బాపట్ల జిల్లా వేమూరు మండలం తెల్లవారి గ్రామంలో ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అవగాహన సెషన్ నిర్వహించారు. పెరవల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, కార్డ్ సిబ్బంది ఎం.శ్రీనివాసరావు, పి.సురేఖ, ఆర్.అనిత విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. విపత్తులు వచ్చినప్పుడు ఎలా రక్షించుకోవాలో పీపీటీ ద్వారా నేర్పించారు. కార్డ్ సంస్థ ఇప్పటికే 5 మండలాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

డిజాస్టర్ అవగాహన.. బాపట్ల జిల్లాలో విద్యార్థులకు శిక్షణ!
డిజాస్టర్ అవగాహన.. బాపట్ల జిల్లాలో విద్యార్థులకు శిక్షణ!

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 7h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.