అనంతపురం జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు

AP: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగు చూస్తోంది. ఇటీవల వెస్ట్ కొడిపల్లిలో జరిగిన ఘటన మరవకముందే, యర్రకొండాపురం గ్రామంలో మరొక వివాదాస్పద అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం బయటపడింది. సర్వే నంబర్ 38లో ఉన్న 6.67 ఎకరాల భూమిని, ఇప్పటికే మృతిచెందిన వ్యక్తి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆగస్టు 14, 2026న ఈ అక్రమ రిజిస్ట్రేషన్ దస్తావేజులను రద్దు చేసినట్లు సమాచారం.



