రాజస్థాన్ లో దళిత పూజారిపై పదే పదే దాడులు !

రాజస్థాన్లో ఒక దళిత పూజారిపై ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. తమను హిందువులుగా గుర్తించడం లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈ వేధింపులపై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ను సైతం ఆశ్రయించినా పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా జరిగిన ఈ ఘటన సమాజంలో కుల వివక్ష, దళితులపై జరుగుతున్న వరుస దాడులు , శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.



