ఉత్తరాఖండ్లో విషాదం.. టన్నెల్లోకి నీరు, మట్టి
ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం కన్స్ట్రక్షన్లో ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు టన్నెల్లోకి ఒక్కసారిగా నీరు, మట్టి చేరడంతో దారుణం జరిగింది. టన్నెల్లో ఉన్న 22 మంది కార్మికుల్లో 21 మందిని రెస్క్యూ టీమ్స్ బయటకు తీసుకువచ్చాయి. వీరిలో ఏడుగురు చనిపోగా, మరో 14 మంది గాయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఘటనపై CM పుష్కర్ సింగ్ ధామి ఆందోళన వ్యక్తం చేశారు. చిక్కుకున్న కార్మికులను సేఫ్గా బయటకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.



