← Back to news

మెరైన్ పోలీసుల దాడులు.. రెండు బోట్లు సీజ్

By DeeKay· 18 Jun 2026· Hmtvlive· నెల్లూరు జిల్లా
మెరైన్ పోలీసుల దాడులు.. రెండు బోట్లు సీజ్

AP: నెల్లూరు జిల్లాలోని సముద్ర జలాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన మెకనైజ్డ్ పెద్ద బోట్లతో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ చేపల వేట కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారిని గుర్తించి, అరికట్టేందుకు మత్స్యశాఖ, మెరైన్ పోలీస్, అటవీశాఖల ఆధ్వర్యంలో రెండు మెకనైజ్డ్ బోట్లతో నిరంతర సముద్ర గస్తీ నిర్వహిస్తున్నారు. ఇందుకూరుపేట మండల తీరానికి సుమారు 15కిలోమీటర్ల దూరంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన రెండు మెకనైజ్డ్ బోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపలవేట నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ రెండు బోట్లను పట్టుకుని సీజ్ చేశారు.

More in AP