అటవీ ప్రాంతంలో మానవ అస్థిపంజరం.. నిర్మల్లో కలకలం!

నిర్మల్ జిల్లా కోథల్గావ్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తికి చెందిన అస్థిపంజరం లభ్యమైంది. పుర్రెతో పాటు కేవలం రెండు, మూడు ఎముకలు మాత్రమే దొరికాయి. దీంతో గ్రామంలో కలకలం రేగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గత 4-5 నెలలుగా మానసిక స్థితి సరిగా లేని గుర్తుతెలియని వ్యక్తి ఆ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉండేవాడని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలంలో పంచనామా, స్పాట్ పీఎంఈ నిర్వహించిన పోలీసులు.. ఎముకలను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం భద్రపరిచారు.



