← Back to news

అటవీ ప్రాంతంలో మానవ అస్థిపంజరం.. నిర్మల్లో కలకలం!

By Digamber· 2d ago
అటవీ ప్రాంతంలో మానవ అస్థిపంజరం.. నిర్మల్లో కలకలం!

నిర్మల్ జిల్లా కోథల్‌గావ్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తికి చెందిన అస్థిపంజరం లభ్యమైంది. పుర్రెతో పాటు కేవలం రెండు, మూడు ఎముకలు మాత్రమే దొరికాయి. దీంతో గ్రామంలో కలకలం రేగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గత 4-5 నెలలుగా మానసిక స్థితి సరిగా లేని గుర్తుతెలియని వ్యక్తి ఆ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉండేవాడని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలంలో పంచనామా, స్పాట్ పీఎంఈ నిర్వహించిన పోలీసులు.. ఎముకలను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం భద్రపరిచారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 5h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.