← Back to news

విద్యార్థిని ఆత్మహత్యకు వేధింపులే కారణమంటూ LHPS ధర్నా

By Adithya· 1d ago
విద్యార్థిని ఆత్మహత్యకు వేధింపులే కారణమంటూ LHPS ధర్నా

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని ఆత్మహత్యకు ప్రిన్సిపల్, అధ్యాపకుల వేధింపులే కారణమని లంబాడి హక్కుల పోరాట సమితి ఆరోపించింది. గురువారం కళాశాల ముందు ధర్నా నిర్వహించి, విచారణ, చర్యలు డిమాండ్ చేశారు. LHPS అధ్యక్షుడు రాంబల్ నాయక్ బాలిక కుటుంబానికి న్యాయం చేసేదాకా పోరాడతామని హెచ్చరించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.