బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ నిరసన

TG: బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు, DCC అధ్యక్షుడు బీర్ల అయిలయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, విద్యార్థులు, యువత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలను కొనసాగిస్తుందని తెలిపారు.



