జగ్గయ్యపేటలో ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక

AP: ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలి.. ప్రతి అర్జీపై పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ‘ఒక నెల–ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేటలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జగ్గయ్యపేటలోని ఎస్.వి.ఎస్. కళ్యాణ మండపంలో ఇవాళ ఉదయం 10గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారని చెప్పారు.

