CJP ఎంట్రీతో ప్రిన్సిపాల్ సస్పెండ్!
మహారాష్ట్రలోని హింగోలి జిల్లా లింబాలా మక్తా గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. స్కూల్లోనే మద్యం తాగి క్లాస్రూమ్లో నిద్రపోతున్నాడని విలేజర్స్, సీజేపీ ఫౌండర్ <a href="https://x.com/abhijeet_dipke/status/2089603362107048005?s=20">అభిజీత్ దిప్కే</a> బిడిఓకి కంప్లైంట్ చేశారు. దిప్కే ఆగస్టు 15న స్కూల్ను విజిట్ చేసి, యాక్షన్ తీసుకోకపోతే ప్రొటెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ సస్పెండ్ అయినప్పటికీ, ఐదు క్లాసులకు ఇద్దరే టీచర్స్ ఉన్నారని, మరో ఇద్దరు టీచర్లను ఇచ్చే వరకు తమ ఫైట్ కంటిన్యూ అవుతుందని దిప్కే స్పష్టం చేశారు.



