అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: సీఐటీయూ

TG: గ్రామపంచాయతీ కార్మికులపై బోధన్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సీఐటీయూ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఆర్.ఎం. రమేష్ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24న నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే గ్రామపంచాయతీ కార్మికుల వల్లే గ్రామాల అభివృద్ధి ఆగిపోయిందంటూ చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు.

