నేడు సౌత్ స్టేట్స్ CMలతో అమిత్ షా భేటీ.. Hot Topics ఇవే!
తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా కోవళంలో 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ మీట్ ఈరోజు జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగే ఈ భేటీకి సౌత్ స్టేట్స్ CMలు, అధికారులు హాజరవుతున్నారు. రాష్ట్రాల్లో సమస్యలు, నీటి పంపకాలు, ఎడ్యుకేషన్, హెల్త్, లా అండ్ ఆర్డర్, ఎకనామిక్ డెవలప్మెంట్పై చర్చించే అవకాశముంది. ముఖ్యంగా కావేరీ వాటర్ డిస్ప్యూట్స్, ఏపీ-తెలంగాణ విభజన అంశాలపై చర్చకు ఇంపార్టెన్స్ ఉండనుంది. ఈ సమావేశాలు కేంద్ర-రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్, వివాదాల పరిష్కారానికి కీలక వేదికగా నిలుస్తున్నాయి.


