గురజాలలో ఓటర్ల జాబితా విడుదల..!

ఇది విన్నారా? పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీలో ఓటర్ల జాబితా సిద్ధమైంది. 23 వార్డుల ఫోటో ఎలక్టోరల్ రోల్ విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2026 జనవరి 1ని ప్రామాణిక తేదీగా తీసుకున్నారు. ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్, ఎంపీపీ కార్యాలయాల్లో జాబితాలు అందుబాటులో ఉన్నాయి. ఓటర్లు వెళ్లి తమ పేర్లు చెక్ చేసుకోవాలి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు తెలియజేయాలి. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.



