ఒడిశా కేడర్ ఐపీఎస్..హైదరాబాద్లో కన్నుమూత

ఒడిశా కేడర్కు చెందిన కేరళం ఐపీఎస్ అధికారి షఫీన్ అహ్మద్.కె(50) క్యాన్సర్తో మరణించారు. 2003 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన షఫీన్ సీఐటీయూ నాయకుడు హబీబ్ కుమారుడు. ఒడిశాలో క్రైమ్ బ్రాంచ్, సైబర్ క్రైమ్ ఐజీగా పనిచేస్తున్నారు. కేరళంలో డిప్యుటేషన్పై తిరువనంతపురం రూరల్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్గా కూడా ఉన్నారు. క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇక్కడే కన్నుమూశారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేశారు.



