TB వ్యాధిని గుర్తించే AI ..!

క్షయ (TB) వ్యాధిగ్రస్తుల్ని ముందస్తుగా గుర్తించడానికి ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. సాల్సిట్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన శ్వాస అనే ఏఐ సాఫ్ట్ వేర్ స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే సులభంగా TB పేషెంట్లను గుర్తించవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ ఉన్న ఫోన్ ను దగ్గరగా పెట్టుకొని దగ్గితే ఆ వ్యక్తిలో టీబీ లక్షణాలున్నాయో లేదో అది చెప్పేస్తుంది. ఏపీలో ఆంధ్రా మెడికల్ కళాశాలలో క్లినికల్ ట్రయల్స్ ఉన్న శ్వాస అందుబాటులోకి వస్తే టీబీని కట్టడి చేయవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. మన దేశంలో సకాలంలో గుర్తించకపోవడం వల్ల ప్రపంచంలో టీబీ కేసుల్లో 28శాతం నమోదవుతున్నాయి.



