సాయికృష్ణ మిస్సింగ్ కేసులో CC ఫుటేజ్ మాయం

AP: సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ అధికారులు కీలకమైన విషయాన్ని గుర్తించారు. కేసులో CCTV ఫుటేజ్ మాయమైనట్లు అధికారులు నిర్ధారించారు. సాయికృష్ణ మిస్సింగ్ ఉదంతంలో నిజానిజాలు రాబట్టేందుకు CCTV విజువల్స్ ఎంతో కీలకంగా మారాయి. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు (నెల రోజుల పాటు) ఉన్న పూర్తి సీసీ ఫుటేజ్ సిస్టమ్ నుంచి మాయమైనట్లు అధికారుల విచారణలో తేలింది. నెలరోజులకు సంబంధించిన రికార్డింగ్స్ ఉండాల్సిన చోట, కేవలం రెండురోజుల ఫుటేజ్ మాత్రమే ఉంచి, మిగతాదంతా డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.



