అర్ధరాత్రి మోదీ వీడియో
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో పేపర్ లీక్లను అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని సోమవారం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.



