బౌద్ధం, కళలతో శతాబ్దాల బంధం: మంత్రి జూపల్లి

తెలంగాణ–శ్రీలంక మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాంస్కృతిక మార్పిడిని విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బౌద్ధం, సంస్కృతి, కళలు ఇరు ప్రాంతాల మధ్య శతాబ్దాల అనుబంధానికి ప్రతీకలని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన నృత్యాంగణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీలంక కళాకారుల బృందం సచివాలయంలో మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా కళాకారులను మంత్రి సన్మానించారు. శ్రీలంక సంప్రదాయ నృత్యాలను తెలంగాణలో ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు.



