గంజాయి అమ్మినా, వాడినా కఠిన చర్యలు!⚠️

TG : తాండూరులోని విలియం మూన్ స్కూల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గరున్న బ్యాగులను తనిఖీ చేయగా 1,260 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో ఆ గంజాయిని తీసుకోని, ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. గంజాయి లేదా వేరే ఏ మత్తు పదార్థాలైనా అమ్మినా, వాడినా కఠిన చర్యలు ఉంటాయని, సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు చెప్పాలని అధికారులు సూచించారు.



