ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

TG: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు(22) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. యువకుడు కొంతకాలంగా ప్రేమ వ్యవహారంలో ఉన్నట్లు సమాచారం. చేతికొచ్చిన కొడుకును కోల్పోవడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.



