ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ‘మోదీ చాలీసా’
ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కొందరు ‘మోదీ చాలీసా’ను పఠించారు. బ్యానర్పై ‘భగవాన్ శ్రీ నరేంద్ర మోదీ చాలీసా’ అని రాశారు. అక్కడున్నవారు “జై జై మోదీ..హర్ హర్ మోదీ” అని నినాదాలు చేశారు. విల్లు పట్టుకున్న రాముడి రూపంలో ఉన్న మోదీ చిత్రానికి హారతి ఇచ్చారు. డాక్టర్ రాజన్ సింగ్, మహామండలేశ్వర్ వైభవి మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా చెప్పింది. హాల్ను ఒక సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం తీసుకుందని, కానీ విషయం తెలిసి ఆ ప్రోగ్రామ్ను ఆపేశామంది.



