← Back to news

ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ‘మోదీ చాలీసా’

By Vishi· 20 Aug 2026

ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కొందరు ‘మోదీ చాలీసా’ను పఠించారు. బ్యానర్‌పై ‘భగవాన్ శ్రీ నరేంద్ర మోదీ చాలీసా’ అని రాశారు. అక్కడున్నవారు “జై జై మోదీ..హర్ హర్ మోదీ” అని నినాదాలు చేశారు. విల్లు పట్టుకున్న రాముడి రూపంలో ఉన్న మోదీ చిత్రానికి హారతి ఇచ్చారు. డాక్టర్ రాజన్ సింగ్, మహామండలేశ్వర్ వైభవి మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా చెప్పింది. హాల్‌ను ఒక సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం తీసుకుందని, కానీ విషయం తెలిసి ఆ ప్రోగ్రామ్‌ను ఆపేశామంది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 7h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.