← Back to news

జెండా చిరిగిపోయినా స్పందించని అధికారులు

By DK· 20 Jul 2026· హైదరాబాద్
జెండా చిరిగిపోయినా స్పందించని అధికారులు

TG: హైదరాబాద్‌లోని నాగోల్ మూసీ నదీ తీరంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా చిరిగిపోయి నేలపై పడిపోవడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఇనుప గొలుసులు(రోప్స్) తెగిపోవడంతో జెండా కింద పడిపోయినా, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోలేదని స్థానికులు ఫైరయ్యారు. దాదాపు వారం క్రితమే కింద పడ్డా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకుండా వదిలేశారని విమర్శిస్తున్నారు. స్తంభానికి మరమ్మతులు చేపట్టి, కొత్త జెండాను ఆవిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

More in TG