బహుజనుల కోసం పోరాడిన వీరుడు పాపన్న గౌడ్

TG: గద్వాలలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గద్వాల గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన నాయకులు మాట్లాడుతూ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడిగా ఆయనను గుర్తుచేశారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలతో 17వ శతాబ్దంలోనే గోల్కొండ కోటపై బడుగుల ఆత్మగౌరవ జెండాను ఎగురవేసిన ధీరుడని పేర్కొన్నారు.



