జాతీయ జెండాలోని అశోక చక్రం విశేషాలు

మన జాతీయ జెండా మధ్యలోని తెల్లని పట్టీపై ముదురు నీలం రంగులో ఉండే అశోక చక్రంలో 24 ఆకులు ఉంటాయి. దీన్ని క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందిన అశోకుడి సారనాథ్ సింహ స్తంభం(ధర్మచక్రం) నుండి తీసుకున్నారు. అశోకచక్రం న్యాయానికి, ధర్మానికి సంకేతంగా నిలుస్తుంది. స్వాతంత్ర్యానికి ముందు ఆ స్థానంలో రాట్నం(చర్ఖా) ఉండేది. 1947 జూలై 22న రాజ్యాంగ సభ చర్ఖా స్థానంలో ఈ అశోక చక్రాన్ని చేర్చి అధికారికంగా ఆమోదించింది.


