ఐఐటీ మద్రాస్ కొత్త కూలింగ్ టెక్నాలజీ

IIT మద్రాస్ రీసెర్చర్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు వేడెక్కకుండా సరికొత్త కూలింగ్ టెక్నాలజీ కనిపెట్టారు. 'ఫ్లాట్ ప్లేట్ పల్సేటింగ్ హీట్ పైప్' అనే డిజైన్ ద్వారా ఎలక్ట్రిక్ వస్తువుల వేడిని ఈజీగా కంట్రోల్ చెయ్యొచ్చు. దీన్ని రాగికి బదులు అల్యూమినియంతో తయారు చేశారు. దీని వల్ల బరువు తగ్గింది. వేడిని తగ్గించే సామర్థ్యం 20% పెరిగిందని IIT మద్రాస్ ప్రకటించింది. ఈ టెక్నాలజీ ఫ్యూచర్లో EV, ఏరోస్పేస్, డేటా సెంటర్లకు బాగా ఉపయోగపడుతుందనేది అంచనా.



