హనుమకొండలో పవన్ బర్త్ డే.. కార్యకర్త కుటుంబానికి FD!

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో జనసేన కార్యకర్తలుపవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు, పాఠశాలలో స్టూడెంట్స్కు పండ్లు పంపిణీ చేశారు. మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన జియవొద్దీన్ అనే వీరాభిమాని రోడ్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన ఇద్దరు కూతుళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, బాండ్లను కుటుంబానికి అందజేశారు. పార్టీ అధికార ప్రతినిధి చల్లా శివారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల బీమా పాలసీ తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ దేనని గుర్తు చేశారు.





