మైండ్ బ్లాకింగ్ డ్యాన్స్!
విజయనగరం జిల్లా భోగాపురంలో గిరిజన కళాకారులు చరిత్ర సృష్టించారు. దాదాపు 13 వేల మంది గిరిజన బాలికలు ఒక్కసారిగా థింసా నృత్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. గిన్నిస్ ప్రతినిధులు ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ను స్వయంగా పరిశీలించి రికార్డ్ కన్ఫర్మ్ చేయగా, మంత్రి సంధ్యారాణి ఆ అవార్డును అందుకున్నారు. ఆమె కూడా గిరిజన బాలికలతో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. అంతేకాదు, రేపు ఏపీకి రానున్న ప్రధాని మోదీకి ఇదే థింసా నృత్యంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.



