← Back to news

మైండ్ బ్లాకింగ్ డ్యాన్స్!

By sahani· 31 Jul 2026· AP

విజయనగరం జిల్లా భోగాపురంలో గిరిజన కళాకారులు చరిత్ర సృష్టించారు. దాదాపు 13 వేల మంది గిరిజన బాలికలు ఒక్కసారిగా థింసా నృత్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. గిన్నిస్ ప్రతినిధులు ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌ను స్వయంగా పరిశీలించి రికార్డ్ కన్ఫర్మ్ చేయగా, మంత్రి సంధ్యారాణి ఆ అవార్డును అందుకున్నారు. ఆమె కూడా గిరిజన బాలికలతో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. అంతేకాదు, రేపు ఏపీకి రానున్న ప్రధాని మోదీకి ఇదే థింసా నృత్యంతో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

More in Entertainment