← Back to news

పల్నాడులో కరువు పరిస్థితులపై అలర్ట్

By siva· 1d ago
పల్నాడులో కరువు పరిస్థితులపై అలర్ట్

పల్నాడు జిల్లాలో వర్షాభావంతో కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని Nature Welfare Council AP చైర్మన్ అంబటి నవకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బోర్లు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు, పశువులకు తీవ్ర నీటి కొరత ఏర్పడుతోందని ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ వనరుల ద్వారా ట్యాంకర్ల సరఫరా, చెరువులు-కాలువల రీచార్జ్ చర్యలు చేపట్టాలని, కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని కోరారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.