← Back to news

ముంబైకర్లను.. తెలంగాణ స్థానికులుగా గుర్తించాలి!

By Mulnivasi· 2d ago
ముంబైకర్లను.. తెలంగాణ స్థానికులుగా గుర్తించాలి!

ముంబైలోని తెలంగాణ వలస కార్మికుల కోసం ఓ డిమాండ్ వినిపిస్తోంది. బుధవారం ధోబీఘాట్‌లోని సంత్ గాడ్గేబాబా విగ్రహం వద్ద ఉద్యమ నేత బట్టు శ్రీధర్ గంగపుత్ర, రాజు మాదిగ మాట్లాడారు. ’’ముంబైకర్లు రెండు రాష్ట్రాల మధ్య నాన్-లోకల్‌గా మిగిలిపోతున్నారు. ఇది బాధాకరమ‘‘ని శ్రీధర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కె.కె. కమిటీ ప్రతిపాదించిన సౌకర్యాలు ముంబై ఉద్యమకారులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రజక సమాజం, ఎంటిజెఏసి నేతలు కల్లూరి సురేష్, తడ్కపల్లి నరేష్, సిద్దిరాములు, ఎస్.రాజు, భూమేష్, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.

ముంబైకర్లను.. తెలంగాణ స్థానికులుగా గుర్తించాలి!

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 6h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.