సింహాచలం గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు !

విశాఖలో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ వైభవంగా సాగుతోంది. సుమారు 32 కిలోమీటర్ల దూరం సాగే ఈ పవిత్ర ప్రదక్షిణలో పాల్గొనడానికి దాదాపు 8 లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారని అంచనా. కొండపైకి దాదాపు 50 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. భక్తుల రష్ దృష్ట్యా ఇవాళ,రేపు ఆర్జిత సేవలను బంద్ చేశారు. అలాగే కొండపైకి ప్రవేటు వెహికల్స్ ను నిరాకరించారు. ఈ వేడుక సందర్భంగా 221 స్కూళ్లకు సెలవు ఇచ్చారు.



