← Back to news

మండపాల ఏర్పాట్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలి

By A VIJAY KUMAR· 1d ago· Warangal
మండపాల ఏర్పాట్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలి

TG: వరంగల్ జిల్లా ఖానాపూర్‌లో గణేష్‌ మండపాల నిర్వాహకులు విద్యుత్‌ ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని విద్యుత్‌ శాఖ అదనపు సహాయ ఇంజినీర్‌ ఎ. మంగమ్మ సూచించారు. లైసెన్స్‌ పొందిన ఎలక్ట్రీషియన్‌తోనే వైరింగ్‌ పనులు చేయించాలని, మండపాల్లో ఈఎల్‌సీబీ, నాణ్యమైన ఎంసీబీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైర్లకు ఎలాంటి జాయింట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తడి చేతులతో విద్యుత్‌ పరికరాలను తాకరాదని సూచించారు. విద్యుత్‌ స్తంభాలకు ఫ్లెక్సీలు కట్టకూడదని స్పష్టం చేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 3h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.