ఉప్పు అనుకుని డిటర్జెంట్ వేశారు… 36 మంది పిల్లలు అస్వస్థత

స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలకు ఒక్కసారిగా వాంతులు, తల తిరగడం మొదలయ్యాయి. బిహార్లోని నలందా జిల్లాలోని పరాసి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 36 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో ఉప్పు తక్కువగా ఉందని కొందరు చెప్పడంతో, వంటమనిషి ఉప్పు అనుకుని డిటర్జెంట్ పౌడర్ కలిపినట్లు స్థానికులు చెబుతున్నారు. వంటగదిలో ఉప్పు, డిటర్జెంట్ డబ్బాలు ఒకే చోట ఉండటమే ఈ పొరపాటుకు కారణమై ఉండొచ్చని సమాచారం. పిల్లలను ఆసుపత్రికి తరలించగా, అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని అధికారులు తెలిపారు.



