← Back to news

పట్టాల సర్వే, ఆన్‌లైన్ సౌకర్యం కల్పించాలని వినతి

By ORSU KRISHNA· 18 Aug 2026· నంద్యాల జిల్లా
పట్టాల సర్వే, ఆన్‌లైన్ సౌకర్యం కల్పించాలని వినతి

AP: నంద్యాల జిల్లా సంజామల మండలం గిద్దలూరు గ్రామపంచాయతీ పరిధిలోని చీమలతిప్ప తాండాకు చెందిన గిరిజనులు తమ భూముల సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. 2006లో తమకు మంజూరైన పట్టాలకు సంబంధించి సర్వే నిర్వహించి, ఆన్‌లైన్‌లో నమోదు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ప్రజాసంఘాల నాయకులతో కలిసి సంజామల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తమకు పట్టాలు మంజూరైనా ఇప్పటివరకు సర్వే, ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు తెలిపారు.

పట్టాల సర్వే, ఆన్‌లైన్ సౌకర్యం కల్పించాలని వినతి

More in Local