తాగునీటిని వృథా చేస్తే చర్యలుంటాయి: జలమండలి
TG: తాగునీటిని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది. హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 33లోని ఒక భవనం దగ్గర తాగునీటితో ఇంటిముందు నీటితో కడుగుతూ వృథా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ ఇంటి ఓనర్కు రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. మరోసారి నీటిని వృథా చేస్తే డ్రైనేజీ కనెక్షన్లను నిలిపివేయడంతోపాటు మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



