పల్లెల్లో ఆర్ఎంపీల ఇష్టారాజ్యం.. ప్రాణాలతో చెలగాటం

TG: జగిత్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్సకే పరిమితం కావాల్సిన కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు దాటి వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణ ప్రథమ చికిత్సకు మించి బెడ్లు ఏర్పాటు చేయడం, సెలైన్లు ఎక్కించడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, అధిక మోతాదులో మందులు వినియోగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరైన వైద్య అర్హతలు, అత్యవసర వైద్య సదుపాయాలు లేకుండా చికిత్సలు అందించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.

