← Back to news

మీకు కనిపించాల్సిన హెచ్చరిక ఎందుకు ఆగింది?

By Nani Garikina· 25 Aug 2026
మీకు కనిపించాల్సిన హెచ్చరిక ఎందుకు ఆగింది?

చిప్స్ ప్యాకెట్ లేదా కూల్‌డ్రింక్ బాటిల్ తీసుకున్న వెంటనే.. ఇందులో చక్కెర, ఉప్పు ఎంత ఉందో ఒక్క చూపులో తెలిసిపోతే ఎలా ఉంటుంది? ఇలాంటి వివరాలు ప్యాకెట్ ముందే స్పష్టంగా కనిపించేలా హెచ్చరికలు పెట్టాలని FSSAI ప్రతిపాదించింది. కానీ దీనికి పెద్ద ఆహార కంపెనీల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ లేబుల్స్ వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తాయని కంపెనీలు వాదించాయి. దీంతో FSSAI ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకుని, నలుపు-తెలుపు పోషక వివరాల పట్టికను సూచించింది. అయితే ఈ మార్పుపై సుప్రీంకోర్టులోనూ చర్చ జరుగుతోంది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 4h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.