ఆర్మీ గన్స్ ఎక్కడికి వెళ్లాయి? జవాన్ల ఫోన్లు సీజ్!

సోమవారం సికింద్రాబాద్ బోల్లారంలోని మద్రాస్ రెజిమెంట్లో ఆర్మీ గన్స్, తూటాలు దొంగతనం కేసు పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకున్నారు. దొంగలు తాళాలు బ్రేక్ చేసి, గన్స్తో పాటు వాటికి సెట్ అయ్యే బుల్లెట్లను మాత్రమే తీసుకెళ్లడంతో లోపలి వ్యక్తుల హ్యాండ్ ఉందనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఆర్మీ సిబ్బందిపై 'హనీట్రాప్' ఏమైనా జరిగిందా అనే అనుమానంతో వారి ఫోన్స్, సోషల్ మీడియా అకౌంట్స్ను చెక్ చేస్తున్నారు. కంట్రీ సెక్యూరిటీకి సంబంధించిన ఈ హైప్రొఫైల్ కేసును మిలిటరీ, పోలీసులు ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి.



