అత్యాచార కేసులో నిందితులపై కఠిన శిక్షలు

నారాయణపేట జిల్లా మక్తల్ లో మహిళపై అత్యాచారం, కత్తిపోటు ఘటనలో ఇద్దరు అరెస్ట్ కాగా, కేసులో 70(1) BNS సెక్షన్ మాత్రమే నమోదు చేయడంపై దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి ఇల్లు, వితంతు పింఛన్ మంజూరు చేయాలని, ఆమె కుమారుడికి ప్రత్యేక విద్య అందించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.



