సిడ్నీ హీరోగా హైదరాబాద్ వాసి

సిడ్నీలోని బాండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనలో హైదరాబాద్కు చెందిన రెహ్మత్ పాషా దాదాపు 20 మంది ప్రాణాలను కాపాడారు. గాయపడినవారిని ఆంబులెన్సుల వద్దకు చేర్చిన ఆయన తెగువను మెచ్చి ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా కల్పించింది. ఈ ధైర్యసాహసాలకు గుర్తుగా ఆయన టోపీని సిడ్నీ మ్యూజియంలో ఉంచనున్నారు. త్వరలోనే ఆయన కుటుంబం కూడా ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్లకు కూడా హైదరాబాద్తో సంబంధాలున్నాయి.



