క్లోరోక్విన్.. 7ఏళ్ల ఆదివాసి బాలిక మృతి!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎటపాక మండలంలో 7ఏళ్ల ఆదివాసి బాలిక మృతి చెందింది. ముందస్తు వైద్య పరీక్షలు లేకుండానే క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఆదివాసులు అస్వస్థతకు గురయ్యారన్నారు. కలెక్టర్ వ్యాఖ్యలు కూడా సరికావన్నారు. పోస్టుమార్టం నివేదిక రాకముందే జన్యు గుండె సమస్యల కారణాలను ప్రస్తావించడం సరికాదన్నారు. ఇది అధికారుల బాధ్యతను కప్పిపుచ్చే ప్రయత్నమేనన్నారు.



