← Back to news

క్లోరోక్విన్.. 7ఏళ్ల ఆదివాసి బాలిక మృతి!

By Prasad Sode· 2d ago

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎటపాక మండలంలో 7ఏళ్ల ఆదివాసి బాలిక మృతి చెందింది. ముందస్తు వైద్య పరీక్షలు లేకుండానే క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఆదివాసులు అస్వస్థతకు గురయ్యారన్నారు. కలెక్టర్ వ్యాఖ్యలు కూడా సరికావన్నారు. పోస్టుమార్టం నివేదిక రాకముందే జన్యు గుండె సమస్యల కారణాలను ప్రస్తావించడం సరికాదన్నారు. ఇది అధికారుల బాధ్యతను కప్పిపుచ్చే ప్రయత్నమేనన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 5h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.