← Back to news

ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు పిలుపు

By aveen kumar· 19 Aug 2026
ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు పిలుపు

TG: ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 20న సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు తెలిపారు. సత్తుపల్లి, వేంసూరు ప్రాంతాల నుంచి రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

More in Local