PM SVANidhi స్కీమ్.. చిన్న వ్యాపారులకు ఆర్థిక భరోసా

కరోనా టైమ్లో నష్టపోయిన చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి <a href="https://uatapi.udyamimitra.in/PMSVANidhi/">(PM SVANidhi)</a> స్కీమ్ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా చిన్న వ్యాపారులకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా దశలవారీగా రూ.90,000 వరకు లోన్ ఇస్తుంది. లోన్ను ఆన్టైమ్లో కడితే మరో ఫేజ్లో ఎక్కువ లోన్ పొందే అవకాశముంటుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను ఎంకరేజ్ చేయడానికి క్యాష్బ్యాక్ వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ పథకం 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.



