రూ.3 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన అధికారులు

AP: నెల్లూరులో రూ.3 లక్షల లంచం తీసుకుంటూ తెలుగు గంగ ఇరిగేషన్ శాఖకు చెందిన ముగ్గురు అధికారులు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి లంచం తీసుకుంటున్న సమయంలో ఈఈ మహేష్, డీఈఈ గౌతమ్, ఏఈఈ నారాయణరాజులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారులు వారి కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించారు. లంచం వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

