← Back to news

జంతువుల ఆహారం.. బాంబుగా ఎలా?

By Nani Garikina· 2d ago· Indiatimes
జంతువుల ఆహారం.. బాంబుగా ఎలా?

పంటలను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి పెట్టిన ఆహారమే.. వాటికి ప్రాణాంతక ఉచ్చుగా మారుతోంది. ‘బైట్ బాంబ్స్‌’గా పిలిచే ఈ ఉచ్చుల్లో పేలుడు పదార్థాన్ని ఆహారం లేదా పండులో దాచిపెడతారు. జంతువు దాన్ని సాధారణ ఆహారమని భావించి కొరికిన వెంటనే నోట్లో పేలుడు జరిగి దవడ, నాలుక తీవ్రంగా దెబ్బతింటాయి. దీంతో తినలేక ఆకలితో లేదా ఇన్ఫెక్షన్‌తో చనిపోయే ప్రమాదం ఉంటుంది. అడవి పందులను లక్ష్యంగా పెట్టిన ఈ ఉచ్చులకు ఏనుగులు, ఎద్దులు వంటి ఇతర జంతువులు కూడా బలవుతున్నాయి. ఒడిశాలో ఇటీవల ఇలాంటి ఉచ్చు ఓ ఎద్దు మృతికి కారణమైంది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 54m ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.