← Back to news

హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్.. మిస్ అవ్వకండి!

By sahani· 1d ago· Hyderabad
హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్.. మిస్ అవ్వకండి!

హైదరాబాద్‌లోని విద్యారణ్య హైస్కూల్‌లో సెప్టెంబర్ 12, శనివారం సాయంత్రం 4:30 గంటలకు '75 ఇయర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా' బుక్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. కల్పనా కన్నాభిరాన్ ఎడిట్ చేసిన ఈ బుక్ లాంచ్‌లో హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు జ్యోతిర్మయ శర్మ, మంజరి కాట్జు, నాల్సార్ ప్రొఫెసర్ మురళీ కర్ణం, కల్పనా కన్నాభిరాన్ ప్యానెల్ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ స్పెషల్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యే వారికి సాయంత్రం 4 గంటలకే టీ సర్వ్ చేయనున్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.