← Back to news

విమానాశ్రయంతో కొత్త అధ్యాయం: CM

By DK· 2 Aug 2026· విజయనగరం
విమానాశ్రయంతో కొత్త అధ్యాయం: CM

AP: ఉత్తరాంధ్ర ఇక వెనుకబడిన ప్రాంతం కాదు.. దేశానికే ఆదర్శంగా నిలిచే అభివృద్ధి కేంద్రంగా మారుతుందని CM చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతం ఇక వలసల ప్రాంతం కాదని, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలసలు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ప్రధాని మోదీ సహకారంతో రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 189 ప్రాజెక్టులు వచ్చాయని, 5.57 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

More in AP