విమానాశ్రయంతో కొత్త అధ్యాయం: CM

AP: ఉత్తరాంధ్ర ఇక వెనుకబడిన ప్రాంతం కాదు.. దేశానికే ఆదర్శంగా నిలిచే అభివృద్ధి కేంద్రంగా మారుతుందని CM చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతం ఇక వలసల ప్రాంతం కాదని, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలసలు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ప్రధాని మోదీ సహకారంతో రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 189 ప్రాజెక్టులు వచ్చాయని, 5.57 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.



