హై వే విస్తరణ పేరుతో చెట్లు నరకొద్దని స్థానికుల నిరసనలు !

డెహ్రాడూన్-రిషికేశ్ హైవే విస్తరణకు దాదాపు మూడు వేల సాల్ చెట్లను నరకాలనే ప్రతిపాదన అక్కడి లోకల్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ చెట్లు శివాలిక్ అడవుల్లో ఏనుగుల కారిడార్కు రక్షణగా ఉండటమే కాకుండా, పశువులకు మేతనిస్తాయి. చెట్లు పోతే మేత కొరతతో అప్పుల పాలవుతామని గ్రామస్థులు వాపోతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగి, నీటి వనరులు ఎండిపోతాయన్నది నిపుణుల హెచ్చరిక. తీవ్ర నిరసనల మధ్య ప్రభుత్వం చెట్ల నరికివేతను తాత్కాలికంగా నిలిపివేసింది. రోడ్డు అవసరమా అనే ప్రశ్నలు, పర్యావరణ అంచనా లేకుండా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



