రాజధానిలో 123 అడుగుల కార్తికేయ విగ్రహం.. త్వరలో ప్రారంభం

AP: రాజధాని అమరావతి దగ్గర్లోని నవులూరులో 123 అడుగుల ఎత్తైన భారీ కార్తికేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి గుడికి 2 కి.మీ. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కు 11 కి.మీ దూరంలో ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. స్థానికులు, దాతల సహకారంతో నిర్మిస్తున్న ఈ ప్రాంగణంలో నాలుగు అంతస్తుల ప్రాకారం, ఆలయ నిర్మాణం కూడా కొనసాగుతోంది. త్వరలోనే భక్తుల దర్శనానికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.



