ఆస్పత్రిలో MLA సర్ప్రైజ్ విజిట్

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె MLA షాజహాన్ బాషా శుక్రవారం రాత్రి బైక్పై ఒంటరిగా వచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎమర్జెన్సీ వార్డును సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విషం సేవించి చికిత్స పొందుతున్న ఓ మహిళను పరామర్శించి, ఆమెను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని డాకర్లకు సూచించారు.



