పౌడర్ ట్యాంక్లో పడి కార్మికుడి మృతి.. పోలీసులు కేసు నమోదు!

Dr. B.R. Ambedkar Konaseema జిల్లా రావులపాలెం మండలం ఈతకోటలోని రమ్య ఫుడ్స్ కంపెనీలో బుధవారం సాయంత్రం 6 గంటలకు విషాదం చోటుచేసుకుంది. గంటి గ్రామానికి చెందిన గుత్తుల రాజు (23) అనే యువకుడు పౌడర్ ట్యాంక్పై విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయి మృతి చెందాడు. స్థానికులు, సహచరులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



